టీ20 ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన భారత క్రికెట్ జట్టు బార్బడోస్లోనే ఉండిపోయింది. స్వదేశానికి వారి రాక మరింత ఆలస్యం కానుంది. టీమిండియాను నేరుగా ఢిల్లీకి తీసుకొచ్చేందుకు బీసీసీఐ చార్టర్డ్ విమానం పెట్టింది. అయితే హరికేన్ దృష్ట్యా బార్బడోస్కు ఆ విమానం వెళ్లలేదు. విమానం రాక 5 గంటలు ఆలస్యమైంది. దీంతో బుధవారం వారి విమానం బయల్దేరి గురువారం తెల్లవారుజామున ఢిల్లీకి భారత ఆటగాళ్లు చేరుకోనున్నారు.