ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రహదారుల మరమ్మతులకు రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో గుంతలు పూడ్చే పనులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం 7,092 కిలోమీటర్లలో గుంతలు పూడ్చి, వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేయాలంటే రూ.283 కోట్లు అవసరమని ఇంజినీర్లు అంచనా వేశారు.