లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ అభ్యర్థులు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ అభ్యర్థి తనకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తుతో వినూత్న రీతిలో ప్రచారం చేశాడు. ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ లోక్సభ స్థానం నుంచి పండిట్ కేశవ్ దేవ్ అనే వ్యక్తి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయనకు ఎన్నికల సంఘం పాదరక్షలు (చెప్పులు) గుర్తును కేటాయించింది. దీంతో ఆయన ఏడు చెప్పులు కట్టిన దండ మెడలో వేసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు.