మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంచిర్యాల పట్టణంలోని నక్షత్ర బాయ్స్ హాస్టల్లో ఇంటర్ విద్యార్థి టెకం శ్రీవర్ధన్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మిమ్స్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న శ్రీవర్ధన్ గురువారం రాత్రి హాస్టల్ రూమ్లో ఫ్యాన్ను ఉరేసుకుని ప్రాణాలు విడిచాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడిది ఆసిఫాబాద్ జిల్లా తుమ్రిగూడ గ్రామం.