ఏపీ రాష్ట్రంలో రాజకీయ దృశ్యం మారిపోతోందని
టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వెంకటగిరిలో 'రా కదలిరా' సభలో ఆయన శుక్రవారం మాట్లాడారు. '
వైసీపీ వచ్చాక వెంకటగిరి తలరాత మారిందా? వైసీపీలో ఉండే ఆనం రాంనారాయణరెడ్డి.. జగన్ పాలన బాగోలేదని చెప్పారు.
వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం అయినా సంతోషంగా ఉందా? రాష్ట్రంలో యువతకు
ఉద్యోగాలు వచ్చాయా? ఉద్యోగులకు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి ఉంది' అని పేర్కొన్నారు.