కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాలలో బదిలీ అయిన ఎస్జిటి ఉపాధ్యాయుల ను తక్షణమే రిలీవ్ చేయాలని ఆదివారo బాన్సువాడలో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత గలదని, రిలీవ్ అయినా ఎస్జిటి ఉపాధ్యాయుల స్థానాల్లో విద్యా వాలంటీర్ల ను నియమించాలని ఆయన కోరారు.