జనవరిలో కొత్త పింఛన్లు!

71చూసినవారు
జనవరిలో కొత్త పింఛన్లు!
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏపీ ప్రభుత్వం వచ్చే ఏడాది జనవరిలో కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. జనవరిలో జన్మభూమి-2 కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశాలున్న నేపథ్యంలో ఈ సభల్లో కొత్త పింఛన్ లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో కొత్త పింఛన్ల ఎంపికకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. డిసెంబర్ నెలాఖరు నాటికి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు.

సంబంధిత పోస్ట్