బిచ్కుందలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

246చూసినవారు
బిచ్కుందలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు
బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రముఖర్జీ సర్వేపల్లి రాధ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్బంగా సర్వేపల్లి రాధాకృష్ణ జీవిత విశేషాలు వివరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అకాడమిక్ కో-ఆర్డినేటర్ చంద్రశేఖర్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.