జుక్కల్ - Jukkal

రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఏవో

రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఏవో

ఆగస్టు 5వ తేదీ లోపు అర్హులైన రైతులందరూ రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జుక్కల్‌ వ్యవసాయాధికారి నవీన్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. జూన్‌ 28, 2024 వరకు ధరణి పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకుని డిజిటల్‌ పట్టా పొందిన రైతులు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆయన తెలిపారు. రైతులందరూ వ్యవసాయశాఖ కార్యాలయంలో గాని, గ్రామాల వారీగా ఏఈఓలకు గాని పట్టా పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్సు, నామిని ఆధార్‌కార్డు జిరాక్సులు జతపర్చాలని, ఇది వరకే దరఖాస్తు చేసుకున్న రైతులు సవరణ గాని, నామినీ పేర్లు మార్చవలసి ఉంటే మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

వీడియోలు


కామారెడ్డి జిల్లా
ఇద్దరు నిందితులు అరెస్ట్
Jul 21, 2024, 06:07 IST/కామారెడ్డి
కామారెడ్డి

ఇద్దరు నిందితులు అరెస్ట్

Jul 21, 2024, 06:07 IST
యజమానికి తెలియకుండా నకిలీ పత్రాలు సృష్టించి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ కాలనీలో ఉన్న 200 గజాల ఓపెన్ ప్లాట్ ను కాజేసేందుకు యత్నించిన మారం శ్రీనివాస్, అరేటి గంగాధర్ లను కామారెడ్డి పట్టణ పోలీసులు అరెస్టు చేసి శనివారం న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు సిఐ చంద్రశేఖర్ రెడ్డి ఆదివారం తెలిపారు. రాజయ్య 2002లో ప్లాట్ ను కొనుగోలు చేశారు. కొన్నాళ్ల తర్వాత ఆయన మరణించారు. మారం శ్రీనివాస్ ఎలాగైనా ప్లాట్ ను సొంతం చేసుకోవాలని దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అనంతరం ఆ ప్లాట్ ను వేరొకరికి అమ్మేశాడు. మహేందర్ ప్లాట్ వద్దకు వెళ్లి చూడగా వేరే వారు ఆధీనంలో ఉండడంతో అవాక్కయ్యారు. బాధితుడు వెంటనే పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.