![రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఏవో రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఏవో](https://media.getlokalapp.com/cache/2b/ba/2bba74cb91902f8df0028505fdb64953.webp)
రైతులు బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలి: ఏవో
ఆగస్టు 5వ తేదీ లోపు అర్హులైన రైతులందరూ రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జుక్కల్ వ్యవసాయాధికారి నవీన్కుమార్ ఆదివారం తెలిపారు. జూన్ 28, 2024 వరకు ధరణి పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని డిజిటల్ పట్టా పొందిన రైతులు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ఆయన తెలిపారు. రైతులందరూ వ్యవసాయశాఖ కార్యాలయంలో గాని, గ్రామాల వారీగా ఏఈఓలకు గాని పట్టా పాస్పుస్తకం, ఆధార్కార్డు జిరాక్సు, నామిని ఆధార్కార్డు జిరాక్సులు జతపర్చాలని, ఇది వరకే దరఖాస్తు చేసుకున్న రైతులు సవరణ గాని, నామినీ పేర్లు మార్చవలసి ఉంటే మార్చుకునే అవకాశం ఉందన్నారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.