అంకితభావంతో పని చేస్తే గుర్తింపు

76చూసినవారు
అంకితభావంతో పని చేస్తే గుర్తింపు
ఉద్యోగులు అంకితభావంతో పని చేస్తే సమాజంలో తగిన గుర్తింపు వస్తుందని ఇన్చార్జి మండల ప్రజా పరిషత్ అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బదిలీ అయినా పంచాయతీ కార్యదర్శులను సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎక్కడ పని చేసినా ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు అంతేకాకుండా ప్రజల సమస్యలను తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు.

సంబంధిత పోస్ట్