కందిపప్పు ధర.. డబుల్ సెంచరీ

72చూసినవారు
కందిపప్పు ధర.. డబుల్ సెంచరీ
నిత్యావసర ధరలు సామాన్యులకు రోజురోజుకూ భారీగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టమాటా ధరలు ఆకాశాన్ని అంటగా.. తాజాగా కందిపప్పు రేటు కూడా ఆకాశమే హద్దుగా పైకి దూసుకుపోతుంది. గత నెల రిటైల్ మార్కెట్‌లో కేజీ కందిపప్పు ధర రూ.150-160 ఉండగా ప్రస్తుతం భారీగా దీని రేటు పెరిగింది. తాజాగా కేజీ కందిపప్పు ధర రూ.200లకు చేరుకుంది. సూపర్ మార్కెట్లో అయితే కేజీ కందిపప్పును రూ.220కి విక్రయిస్తున్నారు.

సంబంధిత పోస్ట్