జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయం హుండీ, కట్న, కానుకల ఆదాయం లెక్కింపు కార్యక్రమం సోమవారం ఉదయం 10: 30 నిముషాలకు నిర్వహించబడతుందని కోటిలింగాల దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోస్న కాంత రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమంలో ఔత్సాహికులు, భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు, ఆశీర్వాదాలు అందుకోవాలని ఏ. ఓ కోరారు.