పారిశుద్ద్యం పై ప్రజలకు అవగాహన

285చూసినవారు
పారిశుద్ద్యం పై ప్రజలకు అవగాహన
రామగుండం మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్ IAS 32 వ డివిజన్ లో శుక్రవారం పర్యటించారు. ఈ రోజు నుండి చెత్త సేకరణకు ప్రతీ ఇంటికి వాహనాన్ని పంపించడం జరుగుతుంది అని, ప్రజలు చెత్త ని రోడ్డుపై గాని, నాళ్లలో గాని పోయకుండా, మీ ఇంటికి వచ్చిన వాహనానికి ఇవ్వాలని తెలియజేసారు. మన ఇల్లు శుభ్రంగా ఉంటేనే మన డివిజన్ శుభ్రంగా ఉంటుంది అని, మన డివిజన్ శుభ్రంగా ఉంటేనే మన రామగుండం శుభ్రంగా ఉంటుంది, ప్రజలు అందరు సహకారాన్ని అందిస్తేనే అభివృద్ధి సాధ్యమని అన్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికుల కి మనం అందరం అండగా ఉందాం అని ,లాక్ డౌన్ లో వారి సేవ లు ఆమోగం అని అన్నారు. డివిజన్ లో ఇప్పటికి మీరు చేస్తున్న పనులు బాగున్నాయని కొనియాడారు.

ట్యాగ్స్ :