గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: జిల్లా కలెక్టర్

77చూసినవారు
గర్భిణీల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ: జిల్లా కలెక్టర్
గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల వైద్య అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం ఎలిగేడు మండలం సుల్తాన్ పూర్ గ్రామ పల్లె దవాఖాన, ఎలిగేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసి, ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఈ సమావేశంలో పిహెచ్ సీ వైద్యాధికారి నిస్సి క్రిస్టియానా, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.