
పెద్దపల్లి: 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలాల్లో అక్రమంగా తరలిస్తున్న 65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్ తెలిపారు. గురువారం పెద్దపల్లి బండారికుంట, సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి గ్రామాల్లో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. దేవునిపల్లిలో 30 క్వింటాళ్ల బియ్యం, బండారికుంట వద్ద అక్రమంగా నిల్వ ఉన్న 35 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తనిఖీల్లో పట్టుకున్నామన్నారు.