ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. నేడు ఈడీ అధికారులు కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చనున్నారు. అయితే, ఆయనను మరోసారి కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనున్నట్లు సమాచారం. దీంతో కోర్టు మరోసారి ఈడీ కస్టడీకి అప్పగిస్తుందా.. లేదా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.