బీహార్లో బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ కూటమికి షాక్ తగిలింది. ఎల్జేపీకి చెందిన ఖగారియా నియోజకవర్గ ఎంపీ మెహబూబ్ ఖైజర్ ఆదివారం ఆర్జేడీలో చేరారు. పాట్నాలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, రాష్ట్ర అధ్యక్షుడు జగదానంద్ సింగ్ సమక్షంలో ఆయన ఆర్జేడీ సభ్యత్వం తీసుకున్నారు. ఆయన స్థానంలో రాజేష్ వర్మకు ఖగారియా టికెట్ను ఎల్జేపీ కేటాయించింది. దీంతో ఆయన పార్టీ మారారు.