![నీట్ అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్ నీట్ అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్](https://media.getlokalapp.com/cache/61/30/6130aebbf11a3e074d1957d2a10bcc16.webp)
నీట్ అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కోరుతూ సుప్రీంలో పిటిషన్
నీట్ యూజీ-2024 పరీక్షలో జరిగిన అవకతవకలపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ శనివారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. నీట్ పరీక్ష రాసిన 10 మంది అభ్యర్థులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకలపై బీహార్ పోలీసులు త్వరితగతిన విచారణ పూర్తి చేసి సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని పిటిషన్లో కోరారు.