బైక్ ను ఢీకొట్టిన లారీ
దెందుకూరు బ్రిడ్జి దగ్గర బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. నందిగామ మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన రామిశెట్టి శ్రీనివాసరావు బైకుపై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకి గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని మధిర ప్రభుత్వ ఆసుపత్రికి గ్రామస్థులు తరలించారు.