ఖమ్మం వస్తుండగా కారు బోల్తా... ముగ్గురికి తీవ్రగాయాలు

59చూసినవారు
కూసుమంచి మండలం జీళ్లచెర్వు సమీపంలో నేషనల్ హైవేపై ఆదివారం కారు బోల్తా కొట్టింది. గమనించిన స్థానికులు కారులో ఇరుక్కున్న ముస్లిం దంపతులను బయటకు తీశారు. వాహనంలో ఉన్న ముగ్గురికి గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఖమ్మంలోని అజీజ్ గల్లీకి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్లో ఓ వివాహ కార్యక్రమానికి హాజరై తిరిగి వస్తుండగా ఆదివారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.

ట్యాగ్స్ :