మ‌ద్యం మత్తులో అమ్మ‌వారి చేతులు ధ్వంసం చేసిన ఉపాధ్యాయుడు

80చూసినవారు
మ‌ద్యం మత్తులో అమ్మ‌వారి చేతులు ధ్వంసం చేసిన ఉపాధ్యాయుడు
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తి రూర‌ల్ మండ‌లం ప‌రిధిలో ఉన్న బ్ర‌హ్మ‌ణ‌ప‌ట్టులో దారుణ ఘ‌ట‌న చోటుచేసుకుంది. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఓ ఉపాధ్యాయుడు మ‌ద్యం సేవించి హ‌ల్‌చ‌ల్ చేశాడు. న‌వ‌రాత్రుల్లో భాగంగా గ్రామంలో ఊరేగింపు అనంతరం అమ్మ‌వారు ఆలయానికి చేరుకున్నారు. మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఉపాధ్యాయుడు అమ్మవారి విగ్రహం చేతులు ధ్వంసం చేశాడు. ఘ‌ట‌న అనంత‌రం ఉపాధ్యాయుడు ప‌రారీలో ఉన్న‌ట్లు స‌మాచారం.

సంబంధిత పోస్ట్