
పాలేరు: చెర్వు బజార్ మదర్సాలో ఘనంగా ఈద్-ఉల్-ఫితర్
ముస్లింలు అత్యంత ప్రాముఖ్యతతో జరుపుకునే రంజాన్ వేడుకలు నగరంలోని చెర్వు బజార్ లో గల మదర్సా ఇమ్దాదుల్ ఉలూమ్ లో సోమవారం ఘనంగా జరిగాయి. మదర్సాలోని మైదానంలో ఉదయాన్నే ఈద్ నమాజ్ నిర్వహించారు. ముఫ్తీ మహ్మద్ జలాలుద్దీన్ ఖాస్మీ ఆధ్వర్యంలో జరిగిన ఈద్ నమాజ్ కు నగర ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. తొలుత ఆయన రంజాన్ విశిష్టత గురించి వివరించారు.