అంతరాష్ట్ర దొంగ అరెస్ట్..

82చూసినవారు
అంతర్ రాష్ట్ర నేరస్థురాలిని అరెస్ట్ చేసినట్లు కల్లూరు ఏసిపి ఏ. రఘు బుధవారం తెలిపారు. ఈ నెల 8న సత్తుపల్లి బస్టాండ్లో ఆంధ్రాలోని నూజివీడు మండలం పెద్ద చెరువుగట్టుకు చెందిన దేవరకొండ దుర్గ అనే మహిళ పెనుబల్లి మండలం లంకపల్లి చెందిన ఓ మహిళ వద్ద బ్యాగులోని 112గ్రాముల బంగారం అపహరించింది. విచారణలో నేరం అంగీకరించిన దుర్గ వద్ద చంద్రహారం, 4గాజులు, 2ఛైన్లు, 3ఉంగరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించామన్నారు.