ఆర్టీసీ ప్రయాణికులకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేసిన సీ. ఐ
ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ నందు వేసవి కాలంలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ హానూక్ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డిపో అధికారులు స్థానిక పట్టణ ప్రముఖులు దాతలు మానవతా దృక్పథం పట్ల హర్షం వ్యక్తం చేసి కృతజ్ఞతలు తెలిపారు.