కల్లూరు: శ్రీ మారెమ్మతల్లి ఆలయాన్ని దర్శించుకున్న బీజేపీ నేత
కల్లూరు పట్టణంలోని ఖాన్ పేటలో గల శ్రీమారెమ్మ తల్లి ఆలయాన్ని మంగళవారం బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు దర్శించుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో సత్కరించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం నాయకులు కాశి స్వగృహంలో నిర్వహించిన ఎల్లమ్మ పూజలో పాల్గొన్నారు.