తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి మరోసారి మోదీ మంత్రివర్గంలో చోటు దక్కింది. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా.. రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 1977లో జనతాపార్టీ యువమోర్చా నాయకుడిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 2004లో తొలిసారి హిమాయత్నగర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 మే- 2021 జులై వరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా.. 2021 జులై నుంచి కేంద్ర సాంస్కృతిక, పర్యటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రిగా పని చేశారు.