కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలోని ఈస్గాం శివమల్లన్న స్వామి ఆలయ వార్షికోత్సవాన్ని ఈ నెల 11న నిర్వహించనున్నట్టు ఈఓ వేణుగోపాల్ గుప్తా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వేద పండితుడు ముద్దు నరహరిశర్మ, అర్చకులు సంతోష్ శర్మల ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవం ప్రారంభమవుతుందన్నారు. గణపతి పూజ పుణ్య హవచనం, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు.