బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పూలే కృషి

543చూసినవారు
బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి పూలే కృషి
కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామంలో బుధవారం మహాత్మ జ్యోతిబాపూలే 197వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలకు బీజేపీ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మహాత్మ జ్యోతిబాపూలే త్యాగాలను మరవలేమని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారని అన్నారు.