బెంగాలీల ఆధ్వర్యంలో ఘనంగా జగన్నాథ రథయాత్ర

561చూసినవారు
కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఈస్గాం లో ఆదివారం బెంగాలీల ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్రను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర ప్రతిమలను ఊరేగించారు. హరే రామ హరే కృష్ణ. గోవిందా అంటూ పారాయణాలు చేశారు. మహిళలు, భక్తులు కీర్తనలు, భజనలు ఆలపించారు. భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్