ఈనెల 21 న మహాంకాళి బోనాలు

76చూసినవారు
ఈనెల 21 న మహాంకాళి బోనాలు
కాగజ్‌నగర్‌ పట్టణం ఎఫ్ కాలనీలో వెలసిన శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఈనెల 21వ తేదీన బోనాల జాతర జరుపనున్నారు. ఆదివారం బోనాల కమిటీ అధ్యక్షులు తుమ్మ రమేష్ ఆధ్బర్యంలో సమావేశం నిర్వహించారు. జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. కమిటీ సభ్యులు సోమనాథం, ఓం ప్రకాష్, జగదీష్, వీరస్వామి, సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, శివకుమార్, వెంకటేష్, క్రృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్