పోడు రైతులతో అధికారుల చర్చలు

55చూసినవారు
పెంచికల్ పేట్ మండలం కొండపల్లి శివారులో అటవీ అధికారులు సోమవారం మొక్కలు నాటేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న రైతులు తమ భూమిలో మొక్కలు నాటడం సరికాదని అధికారులను అడ్డుకున్నారు. దీంతో సీఐ రాంబాబు, ఎస్ఐ కొమురయ్య జోక్యం చేసుకుని, ఇన్ చార్జి ఎఫ్ఆర్ఓ సుధాకర్, బీజేపీ నాయకులు సుధాకర్ రావు, రైతులకు మధ్య చర్చలు జరిపారు. సుధాకర్ రావు మాట్లాడుతూ.. ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్