రోడ్డుపై చేపలు పట్టి నిరసన తెలిపిన ప్రయాణికులు

59చూసినవారు
రోడ్డుపై చేపలు పట్టి నిరసన తెలిపిన ప్రయాణికులు
కొమురం భీం జిల్లా పెంచికల్పేట్ నుంచి బెజ్జూర్ కు వెళ్లే రహదారి అంతా అధ్వానంగా మారింది. వర్షం కురిసినప్పుడల్లా రోడ్డుపై నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. దీంతో ఆర్టీసీ బస్సు ప్రయాణిస్తున్న ప్రయాణికులు బస్సును రోడ్డుపై ఆపి చేపలు పడుతూ నిరసన చేపట్టారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారిని బాగు చేసి ప్రయాణికుల ఇబ్బందులను తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్