మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీ

82చూసినవారు
మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్సీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ ఆధ్వర్యంలో శుక్రవారం పంచాయతీ రాజ్&గ్రామీణ అభివృద్ధి మంత్రి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందించారు. సిర్పూర్ నియోజక వర్గంలో కురుస్తున్న వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని, వర్షాలకు దెబ్బతిన్న రహదారుల మరమత్తులకు నిధులు మంజూరు చేయాలని కోరినట్టు ఎమ్మెల్సీ తెలిపారు. వారితో పాటు అర్షద్ హుస్సేన్, సీడం గణపతి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్