మహిళలు స్వశక్తితో ఎదగాలి: ఆర్ఎస్ ప్రవీణ్

74చూసినవారు
మహిళలు స్వశక్తితో ఎదగాలి: ఆర్ఎస్ ప్రవీణ్
మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని భారాస నాయకులు డా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిర్పూర్ లో సోమవారం మహిళలకు స్వయం ఉపాధి కల్పన కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత కట్టుమిషన్‌, ఎంబ్రాయిడరీ శిక్షణతోపాటు కంప్యూటర్ శిక్షణపై అవగాహన పెంచుకోవాలని అన్నారు. స్వయం కృషితో తమ కాళ్లపై తాము నిలబడి ఆర్థికంగా ఎదిగి, ఇతరులకు ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలన్నారు.

సంబంధిత పోస్ట్