దండుపేట కాలనీ రహదారికి బీటీ రోడ్డు నిర్మించాలి

52చూసినవారు
చర్ల మండలం దండుపేట కాలనీ ప్రధాన రహదారికి అధికారులు బీటీ రోడ్డు నిర్మించాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మండల కార్యదర్శి కౌశిక్ అన్నారు. శనివారం దండుపేటకాలనీ, భూములలంక గ్రామాలను నాయకులు సందర్శించి స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సరైన రోడ్డు మార్గం లేకపోవడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే అధికారులు స్పందించి బీటీ రోడ్డు నిర్మించాలని పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you