దిశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం
భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఈసందర్భంగా దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీ మాట్లాడుతూ. భద్రాచలంలో వేసవికాలం నేపథ్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో దిశా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.