రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో ఉదయం 11 గంటలకు వివిధ శాఖల అధికారులతో సమావేశమై అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షిస్తారు. అనంతరం ఖమ్మంలోని క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.