క్రీస్తు ప్రభువు సమాధి నుంచి పునరుత్థానం చెందిన ఈస్టర్ వేడుకను ఆదివారం క్రైస్తవులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గం వ్యాప్తంగా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మతపెద్దలు ప్రార్థనలు చేసి, భక్తులకు దైవ సందేశాన్ని వినిపించారు. క్రీస్తు ప్రభువు సమాజంలో శాంతియుత జీవితం కోసం అనేక బోధనలు చేశారని అన్నారు.