ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌

67చూసినవారు
ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ బంప‌ర్ ఆఫ‌ర్‌
మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా బంప‌ర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. రాబోయే 18వ లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడం కోసం ప్రచార కార్య‌క్ర‌మాన్ని #VoteAsYouAre ప్రారంభించింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా మొదటి సారి తన దేశీయ, అంతర్జాతీయ స‌ర్వీసుల‌ విమాన టికెట్ల‌పై 19% రాయితీని అందిస్తుంది.

సంబంధిత పోస్ట్