మొదటిసారి ఓటు వేసే ఓటర్లకు ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ను ప్రకటించింది. రాబోయే 18వ లోక్సభ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి దేశంలోని యువతను సమీకరించడం కోసం ప్రచార కార్యక్రమాన్ని #VoteAsYouAre ప్రారంభించింది. 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉన్నవారు ఓటు వేసేందుకు వారి సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు ఎయిర్ ఇండియా మొదటి సారి తన దేశీయ, అంతర్జాతీయ సర్వీసుల విమాన టికెట్లపై 19% రాయితీని అందిస్తుంది.