May 04, 2024, 17:05 IST/అశ్వారావుపేట
అశ్వారావుపేట
కాలువలో పడి వ్యక్తి మృతి
May 04, 2024, 17:05 IST
ఒరిస్సా రాష్ట్రం, మల్కాజిగిరి జిల్లా, నేలపురి గ్రామానికి చెందిన గడ్డిగూడ సంతోష(45) చండ్రుగొండ మండలం, బెండాలపాడులో సీతరామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనుల కోసం ఇటీవల 8మంది ముఠాగా ఏర్పడి, ఇక్కడకు కూలీ కోసం వచ్చాడు. ఈ క్రమంలో స్నానం చేయడానికి శనివారం సీతరామ ప్రాజెక్టు కాలువలోకి దిగుతుండగా ప్రమాదవశాత్తు కాలు జారి కాలువలో పడిపోవడంతో అక్కడికక్కడే నీటిలోనే చనిపోయాడు. మృతదేహాన్ని స్థానికుల సహాయంతో బయటకు తీశారు.