Apr 20, 2024, 14:04 IST/అశ్వారావుపేట
అశ్వారావుపేట
గళ్ళంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
Apr 20, 2024, 14:04 IST
ములకలపల్లికి చెందిన కొట్టే శ్రీను (40) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం గేదెలు మేపేందుకు వెళ్ళాడు. ఈ క్రమంలో ములకలపల్లి-తాళ్ళపాయ గ్రామాల మధ్య పాములేరు వాగుపై వంతెన నిర్మాణం జరుగుతుంది. అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్షం ఫలితంగా ప్రమాదవశాత్తు నీటి గుంటలో పడి బయటకు రాలేదు. స్థానిక ఎస్సై రాజమౌళి, అగ్నిమాపక సిబ్బంది శ్రీనుని బయటకు తీశారు. అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.