ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలిపై కాల్పులు

58చూసినవారు
ప్రేమోన్మాది ఘాతుకం.. ప్రియురాలిపై కాల్పులు
మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలో ఓ ప్రేమోన్మాది కాల్పులకు తెగబడ్డాడు. ప్రభు దయామా అనే యువకుడు, ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకున్నారు. అయితే బాలిక కుటుంబం వీరి ప్రేమకు ఒప్పుకోలేదు. ఈ విషయమై ఇంతకు ముందు యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోపం పెంచుకున్న యువకుడు తన ప్రియురాలు, ఆమె తల్లి పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువతి మృతి చెందింది. ఆమె తల్లికి గాయాలయ్యాయి. నిందితుడి కోసం పోలీసులు గాలింపు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్