తాగు, సాగు నీరు లేక ప్రజలు రైతులు ఇక్కట్లు పడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా వల పట్టుకొని బలమైన నాయకుల కోసం తిరుగుతున్నాడని బీఆర్ఎస్ నాగర్ కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. రైతుల కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పడితే రేవంత్ రెడ్డి నాయకులకు కండువాలు మార్చుతున్నారని విమర్శించారు.