జోగులాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మంగళవారం ఉదయం పారిశుధ్య చర్యలు చేపట్టారు. పట్టణంలోని 1, 10, 11 వార్డులలో మురుగు కాలువలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. వేసవిలో దోమల బెడద తీవ్రమవడంతో మున్సిపల్ కార్యాలయ అధికారులు, పాలకవర్గం పారిశుద్ధ్య చర్యలకు ఉపక్రమించారు.