ఈశ్వరమ్మకు రూ. 2 లక్షల ఆర్థిక సాయం: మంత్రి జూపల్లి

564చూసినవారు
నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొల్లాపూర్ నియోజకవర్గం మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళా ఈశ్వరమ్మను కొల్లాపూర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత మహిళకు ప్రభుత్వం తరఫున తక్షణ సహాయంగా రూ. 2 ఆర్థిక లక్షల సాయాన్ని అందజేయనున్నట్లు జూపల్లి ప్రకటించారు. అఘాయిత్యానికి పాల్పడ్డ దుండగులపై చట్టపరమైన చర్యలు ఉంటాయని జూపల్లి తెలిపారు.

సంబంధిత పోస్ట్