రైతు రుణమాఫీ వంద శాతం పూర్తి చేయాలి

65చూసినవారు
రైతు రుణమాఫీ వంద శాతం పూర్తి చేయాలి
జిల్లాలో రైతు రుణమాఫీ వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం రైతులకు ఇబ్బంది కలగకుండా రుణ మాఫీ చేయాలని అన్నారు. మొదటి విడతలో జిల్లాలో 84, 694 మంది రైతులకు రూ. 164 కోట్ల రుణాలు మాఫీ కానున్నాయని అన్నారు. డబ్బులు నేరుగా రైతుల రుణాల ఖాతాలో జమ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్