గుడిపల్లి రిజర్వాయర్ సందర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

1034చూసినవారు
వనపర్తి జిల్లా రేవల్లి మండలంలోని గుడిపల్లి రిజర్వాయర్ ను గురువారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి సందర్శించి పరిశీలించారు. ఎగువ ఆల్మట్టి, నారాయణపూర్ గేట్లు ఎత్తడంతో జూరాల ప్రాజెక్టుకు నీటి తాకిడి భారీగా పెరిగిందని జూరాల గేట్లు ఎత్తిన అనంతరం గుడిపల్లి నుంచి సాగునీరు విడుదల అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా గుడిపల్లి రిజర్వాయర్ లో ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్