‘నీతి ఆయోగ్‌’కు హాజరయ్యేందుకు ఢిల్లీకి చేరుకున్న మమతా బెనర్జీ

50చూసినవారు
పశ్చిమబెంగాల్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జి శుక్రవారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్‌ సమావేశానికి ఆమె హాజరుకానున్నారు. వాస్తవానికి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారం మమతాబెనర్జి గురువారమే ఢిల్లీకి వెళ్లాల్సి ఉండగా.. ఆఖరి నిమిషంలో తన ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్