2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర

75చూసినవారు
2025లో మానవ సహిత అంతరిక్ష యాత్ర
భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ 2025 నాటికి జరుగుతుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఢిల్లీలో గురువారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తొలి డీప్ సీ మిషన్ కూడా 2025 నాటికి జరుగుతుందన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టుకు గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అజిత్ కృష్ణన్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా ఎంపికయ్యారని చెప్పారు. మూడు రోజుల పాటు ఈ మిషన్ సాగుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్