ఛత్తీస్గఢ్లోని టేకులగూడెంలో మరోమారు మావోయుస్టులు చెలరేగిపోయారు. మందుపాతరతో పోలీస్ వాహనాన్ని మావోయుస్టులు పేల్చారు. ఈ ప్రమాద ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మృతి చెందిన జవాన్లను విష్ణు, శైలేంద్ర గా అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందాలు అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకున్నాయి.