చెన్నై విమానాశ్రయంలో భారీగా బంగారం స్మగ్లింగ్ జరిగింది. విమానాశ్రయంలోని గిఫ్ట్ షాప్ను అడ్డాగా చేసుకుని షాపు యజమాని, రషీద్ అలీ అనే యూట్యూబర్ ఈ స్మగ్లింగ్కు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. గత రెండు నెలల్లో చెకింగ్ లేకుండా రూ.300 కోట్ల విలువైన బంగారాన్ని ఎయిర్పోర్ట్ నుంచి బయటకు పంపించినట్లు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి 8 మందిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.